మంత్రి ఉత్తమ్ పర్యటనపై ఆశలు
NEWS Dec 13,2024 02:32 am
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ దెబ్బతినగా, పలు చోట్ల తూముల పరిస్థితి అధ్వానంగా మారింది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల లైనింగ్ మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు. పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎస్సారెస్పీకి శుక్రవారం రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎస్సారెస్పీకి చేరుకోనున్న మంత్రి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.మధ్యాహ్నం వరకు రివ్యూ కొనసాగనుంది. నిర్వహించనున్న సమీక్షపై ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలతో ఉన్నారు.