నేటి నుంచి యాసంగికి నీటి విడుదల
NEWS Dec 13,2024 02:32 am
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి రబీ పంటలకు నీటిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిజాంసాగర్ చేరుకోనున్న మంత్రి ఉత్తమ్ నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం..నిజామాబాద్ జిల్లా పరిధిలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి రబీ పంటలకు సంబందించిన సమీక్ష చేపట్టనున్నారు.