భారత దేశానికి చెందిన గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మ రాజు చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయస్సు లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ఎక్స్ వేదికగా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. దేశానికి గర్వ కారణంగా నిలిచాడని పేర్కొన్నారు.