ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మోడీ కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. దీనిపై సీరియస్ గా స్పందించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాఖ్య భావనకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం.