తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
NEWS Dec 12,2024 07:56 am
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.