అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా తిరుమలలో వర్షం కురుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఘాట్ రోడ్డులో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు సూచించారు.