షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి సజీవ దహనం
NEWS Dec 12,2024 05:18 am
మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున గాతం తిరుపతి తన ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి, ఒక్కసారి మంటలు చెలరేగి బయటకు రాలేక ఆయన సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. తిరుపతి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.