ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
NEWS Dec 12,2024 03:41 am
మంత్రి నారా లోకేష్ ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు పరీక్షలపై ఫోకస్ పెట్టాలని, ఫలితాలలో దేశంలోనే నెంబర్ వన్ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నట్లు తెలిపారు.