పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన
NEWS Dec 11,2024 05:33 am
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు,గల్ఫ్, సైబర్ మోసాలు, నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్లైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని అన్నారు.