ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల కోసం పోరాటం
NEWS Dec 10,2024 06:01 pm
ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నామని టిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని, ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరి మద్దతుతోటే బరిలో నిలుస్తున్నానని అన్నారు. తప్పకుండా అందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటు గెలిపించాలని కోరారు.