లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి
NEWS Dec 10,2024 06:05 pm
విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా విద్యాభ్యాసం చేస్తూ సాదించాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థినులు విద్యను అభ్యసించడం తమ హక్కు అని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా భవిష్యత్తు విద్యాభ్యాసం అవసరం అన్నారు.