15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు
NEWS Dec 10,2024 06:05 pm
గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తూ, జిల్లాలో 19 కేంద్రాల్లో 8085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.