ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకోవాలి
NEWS Dec 10,2024 06:11 pm
తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్బరీ సాగు చేసే ఎస్సీ ,ఎస్టీ రైతులకు 100% రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.