ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధర మండలం మధురానగర్ లో నిర్వహించన సమావేశంలో తన భార్య రూపాదేవిని గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కంటతడి పెట్టారు. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయ్యానని, అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనకు చొప్పదండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచినట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంటూ భావోద్వేకంతో మాట్లాడారు.