విద్యార్థులను అభినందించిన కలెక్టర్ ..
NEWS Dec 02,2024 04:17 pm
జాతీయ స్థాయి అండర్-14 ఆర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. కడెం మండలం అల్లంపల్లి లోని జీయర్ గురుకులం విద్యార్థులు గత నెల 19 నుంచి 21వ తేదీల మధ్యలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అండర్ 14 జాతీయస్థాయి ఆర్చరి పోటీలలో పాల్గొన్నారు. ఈ ఆర్చరీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థులు పి.జగన్, ఎం. హరి ఓం,బి శశివర్ధన్లు ఉత్తమ ప్రదర్శనతో వెండి పతకాలను సాధించడంతో కలెక్టర్ అభినందించారు.