సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం తమ పార్టీ ముఖ్య లక్షణమని పేర్కొన్నారు. రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయంటూ మండిపడ్డారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేశారు సీఎం.