మాసాయిపేట వనరుల కేంద్రానికి సిబ్బందిని నియమించాలి: తపస్
NEWS Dec 02,2024 02:46 pm
మసాయిపేట్ మండల వనరుల కేంద్రానికి M. I. S, కంప్యూటర్ ఆపరేటర్ ను, మెసెంజర్ ను నియమించాలని మసాయిపేట్ మండల తపస్ మండల అధ్యక్షులు భద్రయ్య కోరారు. మండలనికి రెగ్యులర్ MEO ను నియమించి దాదాపు నెల రోజులు గడుస్తున్న సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.