తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతన్నలు ఢిల్లీ బాట పట్టారు. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. ఏ టైం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మోడీ ప్రభుత్వం తమను మోసం చేసిందని, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పి మాట మార్చిందంటూ రైతులు మండిపడ్డారు.