అన్నదానం భవన నిర్మాణానికి విరాళం
NEWS Dec 02,2024 02:38 pm
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి సోమవారం కొవ్వూరు వాస్తవ్వులు ఈర్ల శ్రీనివాసరావు ఓంలత దంపతులు వారి కుటుంబ సభ్యులకు రూ. 50,116 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.