భారతీయులు ముగ్గురు పిల్లల్ని కనాలి
NEWS Dec 01,2024 02:01 pm
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు తప్పనిసరిగా ఇక నుంచి ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఒక కమ్యూనిటీకి సంబంధించి జనాభా 2.1 సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ సమాజం అంతరించి పోతుందని హెచ్చరించారు . దీని కారణంగా చాలా భాషలు ,సమాజాలు ఉనికిలో లేకుండా పోయాయని పేర్కొన్నారు .