జగన్ పై గొట్టిపాటి గరం గరం
NEWS Nov 30,2024 12:06 pm
జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏం సాధించారని శాలువా కప్పాలని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు, విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసినందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు. తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు కప్పాలా? దేశంలోనే అవినీతి సామ్రాట్ అని బిరుదు ఇవ్వాలా అని మంత్రి మండిపడ్డారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు.