సీఎం రైతు సభను వీక్షించిన రైతులు
NEWS Nov 30,2024 11:35 am
మల్లాపూర్: రైతు పండుగ వేడుకల్లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు, రైతు నాయకులు కలిసి మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత -నర్సయ్య, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, ఏవో లావణ్య, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.