పెన్షన్లతో భరోసా పేదలకు ఆసరా
NEWS Nov 30,2024 11:31 am
ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఠంఛనుగా ఇంటి వద్దకే వచ్చి భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. విజయనగరం జిల్లా నెలిమర్లలో పెన్షన్లను వృద్దులకు, లబ్దిదారులకు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు.