కుల సర్వేపై సర్కార్ కు హైకోర్టు షాక్
NEWS Nov 30,2024 11:08 am
సమగ్ర కుల సర్వేలో కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వ బ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వే చేయడంపై కోర్టు స్పష్టత ఇచ్చింది. సర్వేలో కులం ప్రాతిపదికన కాకుండా వృత్తులను అనుసరించి చేస్తున్నారు.