ఈవీఎంలపై కాంగ్రెస్ కు ఈసీ క్లారిటీ
NEWS Nov 30,2024 10:30 am
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్రలో తమ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ బృందం చేసిన ఆరోపణలపై స్పందించింది. తమను కలవాలని సూచించింది. చేసిన ఆరోపణలకు సంబంధించి సమీక్షిస్తామని, రాత పూర్వకంగా సమాధానం ఇస్తామని వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈవీఎంల నిర్వహణపై ఐఎన్సీ కోర్టును ఆశ్రయించింది.