సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
NEWS Nov 30,2024 10:19 am
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక పేదల సేవలో కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. లాజిస్టిక్ , టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ది , తదితర రంగాలపై తాము దృష్టి సారించామని చెప్పారు సీఎం. దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా చేస్తామన్నారు.