డ్రైనేజీ నిర్మాణ పనుల పరిశీలన
NEWS Nov 30,2024 11:28 am
ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో డ్రైనేజి నిర్మాణ పనులను తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఆర్అండ్ బీ డీఈ వెంకటరమణ శనివారం పరిశీలించారు. ఈ డ్రైనేజీ పనులను ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులు సూచించారు.