తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం
NEWS Nov 30,2024 09:12 am
తిరుమల తిరుపతి దేవస్థానం తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్థానికులకు ప్రతి నెలా 3వ తేదీన శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, చంద్రగిరి , రేణిగుంట మండలాల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. డిసెంబర్ 3, 2024 మంగళవారం నుంచి ఇది అమలులోకి రానుంది.