కాంగ్రెస్ ఏడాది పాలన సూపర్
NEWS Nov 30,2024 08:06 am
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నేటితో ఏడాది పూర్తయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఏక కాలంలో 2 లక్షల రుణ మాఫీ చేశామన్నారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. రూ. 10,44 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు . రూ. 1433 కోట్ల రైతు భీమా వర్తింప చేశామని తెలిపారు. రూ. 95 కోట్ల పంట నష్ట పరిహారంతో పాటు రూ. 10,547 కోట్ల ధాన్యం కొనుగోలుతో భరోసా కల్పించామన్నారు సీఎం.