ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు అందజేస్తున్నారని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పంచాయితీ పైపులరోడ్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలల్లోనే ఏకంగా 8.68 లక్షల పెన్షన్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.