తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం
NEWS Nov 30,2024 06:22 am
శ్రీవారి పవిత్రతను, ఆధ్యాత్మిక శాంతిని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా లేదా స్వామి వారికి భంగం కలిగించేలా మాట్లాడినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇవాల్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని కోరారు.