తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వెంకటేశంను పూర్తి కాలపు పదవిలో నియమించినట్లు పేర్కొంది సర్కార్. బుర్రా వెంకటే శం జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కీలక శాఖలను చూస్తున్నారు.