పింఛన్లు అందజేసిన ఎంఎల్ఏ వసంత
NEWS Nov 30,2024 11:38 am
మైలవరం నియోజకవర్గంలో 37,744 మందికి డిసెంబరు మాసంలో రూ.15,98,31,000 ల పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును ఆయన శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చుతోందన్నారు.