ఏపీ ప్రజలకు కరెంట్ షాక్
NEWS Nov 30,2024 05:43 am
ఈఆర్సీ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీ ప్రజలకు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ. 9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. యూనిట్ కు 92 పైసల చొప్పున డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేసేందుకు లైన్ క్లియర్ చేసింది. దీని కారణంగా ప్రజలపై దాదాపు రూ. 7,912 కోట్ల అదనపు భారం పడనుంది.