ఆర్టీసీ బస్సుపై యాసిడ్ దాడి
NEWS Nov 30,2024 04:45 am
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడింది. వారు కేకలు వేయడంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ చంద్రశేఖర్ చేరుకుని బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.