హైదరాబాద్ లో ఖేలో ఇండియా పోటీలు
NEWS Nov 30,2024 02:33 am
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలను వచ్చే ఏడాది 2026లో హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఓకే చెప్పింది. 2025లో బీహార్ లో నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రతినిధి జితేందర్ రెడ్డి ,ఎంపీలు కేంద్ర మంత్రి మాండవీయను కలిసిన సందర్భంగా ఖేల్ ఇండియా పోటీల ఆతిథ్యంపై సానుకూలంగా స్పందించారు.