ఇబ్రహీంపట్నం మండలం ఆమ్మక్కపేట క్రాసింగ్ వద్ద బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. మేడిపల్లిలో నివాసం ఉంటున్న రమేష్ (39) పని నిమిత్తం మేడిపల్లి నుంచి మెట్పల్లి వైపు వెళ్తుండగా అమ్మక్కపేట క్రాసింగ్ వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొని బండరాళ్లపై పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు మెట్పల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై అనిల్ తెలిపారు.