12 వేల థియేటర్లలో పుష్ప- 2 రిలీజ్
NEWS Nov 29,2024 01:05 pm
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్ ఎర్నేనిలు సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న 12000 థియేటర్లలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా రిలీజ్ కాకుండానే ఈ మూవీ రూ. 1,000 కోట్లు కొల్లగొట్టడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ తర్వాత భారీ మొత్తంలో బన్నీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. పుష్ప2 మూవీ పాటలు జనాదరణ పొందాయి.