బీఆర్ఎస్ ఘనంగా దీక్షా దివస్
NEWS Nov 29,2024 11:04 am
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. 2009లో నవంబర్ 29న ఇదే రోజు కేసీఆర్ ను ఖమ్మం ఖిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఆనాటి ఉద్యమ స్మృతులను, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ దీక్షా దివస్ చేపట్టారు. కేసీఆర్ గనుక లేక పోతే రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు నేతలు. ఎందరో చేసిన త్యాగాలు, బలిదానాల కారణంగా ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడిందన్నారు.