మాల సింహగర్జనకు తరలిరావాలి
NEWS Nov 29,2024 03:21 pm
కథలాపూర్ మండలంలో మాల మహానాడు నాయకులు సమావేశం నిర్వహించినట్టు అధ్యక్షులు దయ్య ప్రశాంత్ తెలిపారు. డిసెంబర్ 1న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహ గర్జనకు అధికసంఖ్యలో మాలలు తరలి రావాలని మాలల ఐక్యత చాటి సభను విజయవంతం చేయాలని కథలాపూర్ మండల కమిటీ పక్షాన కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జంగం నరేష్, కోశాధికారి బోడ నాగరాజు, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, మోహన్ జిల్లా నాయకులు ప్రజా గాయకుడు బత్తుల నరేష్ పాల్గొన్నారు.