స్వార్థం తెలియని ప్రజా నేత పవన్ కళ్యాణ్
NEWS Nov 29,2024 09:17 am
రాష్ట్ర అభివృద్ది కోసం తన జీవితాన్ని అంకితం చేశాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి స్పష్టం చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎలాంటి స్వార్థం తెలియదన్నారు. ప్రజల శ్రేయస్సు బాగుండాలని నిత్యం పరితపిస్తుంటాడని అన్నారు. వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా ఉంటాడని అన్నారు. తను ఎల్లప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంత వరకైనా పోరాడుతాడని ప్రకటించారు.