కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం
NEWS Nov 29,2024 08:17 am
దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేందర్, సలీం, సాయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.