మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
NEWS Nov 29,2024 06:19 am
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.700 పెరిగి రూ.71,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.78,110 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.2,000 పెరిగి రూ.లక్షకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.