నిర్మల్ జిల్లాను వణికిస్తోన్న చలి
NEWS Nov 29,2024 07:48 am
నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడి పోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటలలో జిల్లాలోని కనిష్టంగా పెంబి మండలంలో 10.9, గరిష్టంగా దిలావర్పూర్ మండలంలో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శుక్రవారం సంబంధిత అధికారులు తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు, వయోవృద్ధులు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.