మార్కెట్ యార్డులో రైతు పండగ
NEWS Nov 29,2024 04:47 am
మల్యాల: ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా మల్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పాలకవర్గం గురువారం రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రైతులు పండించిన సన్నరకం దాన్యానికి బోనస్ ఇవ్వడంతో పాటు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు చేయడానికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, మ్యాక లక్ష్మణ్, వంశీధర్, తిరుపతి, దేవయ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.