భూసార పరీక్ష పత్రాలపై అవగాహన
NEWS Nov 29,2024 03:39 am
మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి చంద్ర దీపక్ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి ఆరోగ్య పత్రం పథకంలో యాసంగి 2024 కింద ఓబులాపూర్, నూకపల్లి, రామన్నపేట, రాజారం, సర్వాపూర్, మ్యాడంపల్లి గ్రామాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తీర్ణ అధికారి కారుణ్య కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.