విద్యార్థులతో ట్రాఫిక్ అవేర్నెస్
NEWS Nov 28,2024 04:34 pm
ట్రాఫిక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని కోరుతూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులతో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్ చిత్రపటాలను చేతిలో పట్టుకొని, హెల్మెట్స్ ధరించి ట్రాఫిక్ సిగ్నల్ లను తెలియజేస్తూ నినాదాలతో దారి వెంబడి కవాతుగా వెళుతూ అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులతో పాటు టీచర్స్ పాల్గొన్నారు.