బోధనేతర పనులకు ఉపయోగించొద్దు
NEWS Nov 28,2024 03:43 pm
ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించొద్దని తపస్ నాయకులు కోరారు. మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను మధ్యాహ్న భోజన పనుల నుంచి మినహాయించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు వాస్తవ ధరలకు అనుకూలంగా వంట చార్జీలు ఇవ్వాలని, ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సప్లై చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు మాధవ్ రెడ్డి, నర్సింలు, నరేందర్ పాల్గొన్నారు.