మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
NEWS Nov 28,2024 03:29 pm
కథలాపూర్ మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, డైరెక్టర్లు 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ శీను మాట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్క పనిని సొంత పనిగా నిర్వహించాలని మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.