బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
NEWS Nov 29,2024 03:41 am
నిర్మల్ బీసీ సంక్షేమ సంఘము ఆద్వర్యంలో మహాత్మా జ్యోతి బా ఫూలే వర్ధంతి నిర్వహించారు. భారత దేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బా ఫూలే అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు భారత దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు అంటే దానికి కారణం మహాత్మా జ్యోతి బా ఫూలే చేసిన త్యాగఫలం అని కొనియాడారు.